రాక్షస బల్లులు.. గండభేరుండ పక్షులు.. ఇలాంటి భారీ జంతువులు, పక్షుల గురించి సింద్బాద్ సాహసయాత్రలు వంటి కథల పుస్తకాలలో చదువుకున్నాం. స్పీల్బర్గ్ పుణ్యమాని రాక్షస బల్లుల(డైనోసార్లు)ను ఆ మధ్యన 'జురాసిక్ పార్క్' సినిమాలో చూసి .. హాశ్చర్యపోయాం. అయితే ఇన్నాళ్లూ ఈ భూమ్మీద ఉన్న సముద్ర జలాలలో తిరుగాడిన «ద్రువపు ఎలుగుబంటి, వాల్రస్ వంటి జీవులను కూడా భవిష్యత్తులో మనం "ఇదిగో.. «ద్రువపు ఎలుగుబంటి అంటే ఇదే.. అదేమో వాల్రస్''.. అంటూ పాఠ్య పుస్తకాల్లో చూడాల్సి వచ్చేటట్టుంది. ఎందుకంటే ఈ రెండు జీవులు కూడా త్వరలోనే డైనోసార్ల దగ్గరికి వెళ్లిపోతున్నాయి మరి!

««ద్రువపు ఎలుగబంట్లను ఆంగ్లంలో పోలార్ బేర్స్ అంటారు. ఇవి రెండు రకాలు. అలస్కాలో.. కెనడాను అనుకుని ఉండే దక్షిణ బే ఫోర్ట్ సముద్ర
పరీవాహక ప్రాంతంలో కనిపించేవి ఒక రకమైతే, రష్యాను ఆనుకుని ఉన్న చుక్చీ/బేరింగ్ సముద్ర పరీవాహక ప్రాంతంలో కనిపించేవి మరో రకం. ఇక పసిఫిక్ వాల్రస్ (అతి పెద్ద చేపల్లా ఉంటాయి) జీవులు మాత్రం రష్యాని అనుకుని ఉండే చుక్చీ/బేరింగ్ సముద్ర పరీవాహక ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి.
అయితే ఏంటి?
దక్షిణ బే ఫోర్ట్ ప్రాంతంలో కనిపించే ««ద్రువపు ఎలుగుబంట్ల సంఖ్య 1397. వీటిలో మానవ కృతకాల వల్ల ప్రతియేటా 54 మరణిస్తున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చర్యల ద్వారా బతికి బయటపడుతున్నవి 22. బేరింగ్ సముద్ర ప్రాంతంలో వీటి సంఖ్య 2000. ప్రతీయేటా మానవ చర్యల ద్వారా
మరణించేవి 37. అలాగే రష్యాలో ప్రతీయేటా వేటగాళ్ల బారిన పడి మరణిస్తున్న ఎలుగుల సంఖ్య 150 నుంచి 250 వరకూ ఉంటోంది. సంరక్షక చర్యల ద్వారా బతికి బయటపడుతున్నవి 30.
ఇక పసిఫిక్ వాల్రస్ల జనాభా 15,164. వీటిలో 4 వేల నుంచి 5,500 వరకూ మానవుల జిహ్వ చాపల్యానికి మూల్యం చెల్లించుకుంటున్నాయి.
వన్యప్రాణి సంరక్షణ చట్టం ద్వారా ఏటా 607 జీవాల వరకూ మృత్యుపాశం నుంచి బయటపడగలుగుతున్నాయి.
ఎందుకిలా?
ఆర్కిటిక్ ఐకాన్లుగా పిలుచుకునే «ద్రువపు ఎలుగుబంట్లు, వాల్రస్ చేపల జీవన విధానం అంతా అక్కడి సముద్రంలోని మంచుగడ్డలతోనే ముడిపడి ఉంది. ఇప్పుడు అక్కడి మంచు పూర్తిగా కరిగిపోయే దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఈ జీవుల పాలిట పెనుశాపంగా పరిణమించింది. గ్లోబల్ వార్మింగ్ (భూ తాపం) ఈ జీవాల పాలిట మృత్యుపాశంలా తయారైంది మరి. అంతేకాక, ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు నిక్షేపాల అన్వేషణ, చేపల వేట, బోటింగ్, షిప్పింగ్, మిలిటరీ కార్యక్రమాలు.. ఇలాంటివన్నీ కూడా «ద్రువపు ఎలుగుబంటి, వాల్రస్ల మనుగడకు ప్రతికూల పరిస్థితులు కల్పిస్తున్నాయి. వాతావరణంలో రోజురోజుకు పెరుగుతున్న కార్బన్డయాక్సైడ్ భూ తాపాన్ని విపరీతంగా పెంచుతోంది. పర్యవసానంగా పెరుగుతున్న వేడిసెగల కారణంగా «ద్రువ ప్రాంతాలలోని మంచు సైతం కరిగి నీరవుతోంది. దీనికి తోడు వాటి ఆవాస ప్రాంతం అలస్కాలో చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం
జరుగుతోన్న అన్వేషణ కూడా అక్కడి జీవాల అంతానికి కారణమవుతోంది.
అమెరికా వన్యప్రాణుల సంరక్షణ, చేపల అభివృద్ధి సేవల సంస్థ తాజా నివేదిక ప్రకారం.. «ద్రువపు ఎలుగుబంట్ల జనాభా క్రమేణా తగ్గిపోతోంది. వాల్రస్ చేపలైతే అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. "«ద్రువపు ఎలుగుబంట్లు, వాల్రస్లు అంతరించిపోయే జీవుల జాబితాలోకి వచ్చేశాయి. గ్రీన్హౌస్ కాలుష్యం, సముద్రంలో చమురు నిక్షేపాల అన్వేషణ, వెలికితీత వంటి చర్యలు వీటి మనుగడను క్లిష్టంగా మార్చేశాయి. వీటి మనుగడకు తక్షణం అవసరమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో «ద్రువపు ఎలుగులు, వాల్రస్లు మనకు కనిపించవు..'' అని సెంటర్ ఫర్ బయొలాజికల్ డైవర్సిటీకి చెందిన ఓషన్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ బ్రెండన్ కమ్మింగ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏం చేయలేమా?
«ద్రువపు ఎలుగు, వాల్రస్, వేల్స్, డాల్ఫిన్స్, సీల్స్ తదితర సముద్ర క్షీరదాల సంఖ్య కేవలం అంచనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇవి సముద్ర జలాలలో, మంచుగడ్డలపై నివసిస్తూ అప్పుడప్పుడు బయటికి కనిపిస్తుండడంతో వీటి కచ్చిత జనాభా సంఖ్యను తెలుసుకోవడం కష్టం. అయితే గతంలోకంటే వీటి సంఖ్య బాగా తగ్గిందనే విషయాన్ని శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. సముద్ర క్షీరదాల సంరక్షణ చట్టం అమల్లో ఉన్నా.. ఏ యేటికాయేడు వీటి సంఖ్య తగ్గిపోతోంది. ప్రతీయేటా అంతరించిపోయే జీవుల జాబితాలో ఉన్న సముద్ర క్షీరదాల జనాభా వివరాలను సేకరించాల్సిన బాధ్యత ఆయా సంస్థలదే. వేల్స్, డాల్ఫిన్స్, సీల్స్ సంరక్షణ బాధ్యత నేషనల్ మెరైన్ ఫిషరీస్ సర్వీసెస్ది కాగా, «ద్రువపు ఎలుగుబంట్లు, వాల్రస్ చేపలు తదితర జీవుల సంరక్షణ బాధ్యతలు ఫిష్ అండ్ వైల్డ్లైఫ్ సర్వీసెస్ ఏజెన్సీది.
సముద్ర జీవుల జనాభా వివరాల సేకరణ, వెల్లడి, సంరక్షణ విషయాలలో ఈ రెండు ఏజెన్సీలు వాటి బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని, దీంతో చాలా సముద్ర జీవులు అంతరించిపోయే జీవుల జాబితాలోకి వచ్చేశాయని సెంటర్ ఫర్ బయొలాజికల్ డైవర్సిటీ వ్యాఖ్యానిస్తోంది. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ధ్రువపు ఎలుగులు, వాల్రస్లు అంతరించిపోకుండా తగిన చర్యలు తీసుకునే దిశగా ఇది పావులు కదుపుతోంది.
0 comments:
Post a Comment