Saturday 31 October 2009

ల్యాప్‌టాప్స్‌ విత్‌ Windows 7


డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనొవో తన థింక్‌ప్యాడ్‌ శ్రేణిలో కొత్తగా రెండు ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టింది. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లోకి విడుదల చేసిన 'విండోస్‌-7' ఆపరేటింగ్‌ సిస్టంను కలిగి ఉండడం ఈ ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకత. వీటి పేర్లు థింక్‌ప్యాడ్‌ ఎస్‌ఎల్‌ 410, థింక్‌ప్యాడ్‌ ఎస్‌ఎల్‌ 510. ఎస్‌ఎల్‌ 410 మోడల్‌ థింక్‌ప్యాడ్‌ ల్యాప్‌టాప్‌ 14 అంగుళాల డిస్‌స్లే స్క్రీన్‌ సైజుతో లభిస్తుండగా, ఎస్‌ఎల్‌ 510 మోడల్‌ ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ సైజు 15.6 అంగుళాలు. 3జి(థర్డ్‌ జనరేషన్‌) పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకున్న ఈ ల్యాప్‌టాప్‌లు రెండిట్లోనూ హై రిజల్యూషన్‌ కెమెరా నిక్షిప్తం చేయబడి ఉండడమేకాక ఎటి అండ్‌ టి మొబైల్‌ బ్రాండ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ కూడా ఉంటుంది. వ్యాపార వార్గాల వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ల్యాప్‌టాప్‌ల ధరలు వరుసగా రూ.23,457.. రూ.32,840.


0 comments: