ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్ తయారైంది. దీనిని 'ఐఫోన్ త్రీజి సుప్రీమ్' అని పిలుస్తున్నారు. ఈ ఫోన్ ఖరీదు రూ.14.7 కోట్లు. దీనిని బ్రిటన్లోని లివర్పూల్కు చెందిన గోల్డ్ స్టిక్కర్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ తయారు చేసింది. స్టువార్ట్ హ్యూ అనే డిజైనర్ ఈ ఐఫోన్కు రూపకల్పన చేశారు. 22 క్యారెట్ల బంగారంతో తయారైన ఈ ఐఫోన్లో 200 వజ్రాలు తాపడం చేశారు. ఈ ఫోన్ ఫ్రంట్ ప్యానల్పై 136 వజ్రాలు ఉండగా, అందులో 53 వజ్రాల వరకు ఒక్క ఐఫోన్ లోగోలోనే పొందుపరిచారు. ముందు భాగంలో ఉన్న నావిగేషన్ బటన్కు 7.1 క్యారెట్ల విలువైన వజ్రాన్ని తాపడం చేశారు. మొత్తంమ్మీద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ గోల్డెన్ ఐఫోన్ తయారీకి దాదాపు పది నెలలు పట్టింది.
0 comments:
Post a Comment